ఎండిన రిజర్వాయర్లు, కరువు రాష్ట్రం.. ఇదే కేసీఆర్ రాజకీయం.. రేవంత్ రెడ్డి..
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు సర్వత్రా చర్చనీయాంసంగా మారాయి. ఈ నేపథ్యంలో ఏపీలో జగన్ సీఎం గా మళ్లీ గెలుస్తాడు అన్న సమాచారం తన వద్ద ఉంది అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. చంద్రబాబుపై ఉన్న అసూయతో అతను అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అని విమర్శించారు. పక్క రాష్ట్రంలో సీఎం ఎవరు అవుతారు అన్న విషయం తెలిసిన కేసీఆర్ కు అతని పాలనలో తెలంగాణ ఎంత అధోగతి పాలైందో అర్థమవుతోందా అని అడిగారు. కేసీఆర్ మాట్లాడే అబద్ధపు మాటలని ప్రజలు ఎవ్వరు నమ్మటం లేదు అని స్పష్టం చేశారు. ఎండిన రిజర్వాయర్లు, కరువు రాష్ట్రం.. ఇది కేసీఆర్ రాజకీయం. అలాంటి వ్యక్తి రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను పట్టించుకోడు కానీ.. పక్క రాష్ట్రం రాజకీయాల గురించి మాత్రం బాగా పట్టించుకుంటాడు అని వ్యాఖ్యానించారు. అంతేకాదు జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీకి ప్రధాన పోటీ కేవలం బీజేపీ తోనే అని మరొకసారి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.