మేము సిద్ధం.. మరి మీకు ధైర్యం ఉందా..జగన్
మేమంతా సిద్ధం బస్సు యాత్ర లో జోరుగా ప్రచారం నిర్వహిస్తూ కూటమిని కుదేలు చేసే విధంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు జగన్. 2014-19 మధ్య సమయంలో చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేశారని. 2019లో తాను అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పిన జగన్. ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వస్తే తిరిగి జన్మభూమి కమిటీలను తీసుకు వస్తాను అని ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగతాయని.. పొరపాటున బాబును ఎంచుకుంటే పథకాలకు ముగింపు తప్పదని జగన్ పేర్కొన్నారు. కూటమి పార్టీ ఒక నాన్ లోకల్ కిట్టి పార్టీ అని.. ఈ సరికొత్త ఈస్ట్ ఇండియా కంపెనీ ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఎన్నికలు వస్తున్న ఈ తరుణంలో అందరూ వచ్చి ఏపీలో చేరారని.. ఎన్నికల్లో ఓడిపోతే తిరిగి హైదరాబాదుకు వెళ్ళిపోతారని జగన్ ఎద్దేవా చేశారు. తాను పేదలకు మేలు చేశాను అన్న నమ్మకం తనకి ఉందని.. తన మీద అదే నమ్మకం ప్రజలకు ఉంటే ఓటు వేసి గెలిపించాలని కోరుకున్నారు.