ఈ ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ ముక్కలవడం ఖాయం : చంద్రబాబు
ఈ ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ ముక్కలవడం ఖాయం అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాలంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం తథ్యమన్నారు. వైసీపీవి నవరత్నాలు కాదు, నవమోసాలని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలతో ముందుకొస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. దళిత, గిరిజన ద్రోహి.. జలగ జగన్. ఓటేసిన వారిని కాటేసే రకం ఆయనది. ఏకలవ్య మోడల్ స్కూళ్లను నిర్వీర్యం చేశారు. లేటరైట్ ముసుగులో బాక్సైట్ను దోచుకున్నారు. విద్యుత్ ఛార్జీలతో పాటు అన్ని ధరలనూ పెంచేశారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపుల్లేవు. ఆ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్కు పోతోంది. ఉద్యోగాల్లేక యువత రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. జగన్ మీ బిడ్డ కాదు, రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ. జాబు రావాలంటే కూటమి అధికారంలోకి రావాలి అని అన్నారు.