‘రేపు నిన్ను చంపితే ఏమవుతుంది..' జగన్ పై చంద్రబాబు ఆశ్చర్యకర వ్యాఖ్యలు..
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో చంద్రబాబుకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మరి ముఖ్యంగా యువత భవితను మార్చే సాఫ్ట్ వేర్ రంగాన్ని అభివృద్ధి చేసిన మహనీయుడుగా ఆయన్ని చూస్తారు. అలాంటి వ్యక్తి ఈనాడు చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. నిండు సభలో.. అందరి ముందు.. తన వయసుని, పెద్దరికాన్ని, రాజకీయ అనుభవాన్ని విస్మరించి.. ’జగన్మోహన్ రెడ్డి.. రేపు నిన్ను చంపితే ఏమవుతుంది..’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. నెల్లూరు జిల్లా, కొవ్వూరు నియోజకవర్గం, బుచ్చిరెడ్డిపాలెం లో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాన్ని ఎటువైపు తీసుకెళుతున్నాయో అని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థిని ఎదుర్కోవాలి అంటే వారు చేసిన చెడు ఏదైనా ఉంటే ప్రశ్నించండి.. లేదా మీరు చేసిన మంచే ఏమైనా ఉంటే చెప్పండి. అంతేకానీ రాజకీయాలలో హత్యలను హైలెట్ చేయాల్సిన అవసరం ఏమిటి? ఇప్పటికే వివేకా హత్య కేసు రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారింది. ఇలాంటప్పుడు సినిమా డైలాగులు చెప్పడం.. ఫ్యాక్షనిస్టులు లాగా మాట్లాడడం.. ఇంత వయసు ఉన్న చంద్రబాబుకు తగునా? ముందుండి నడిపించాల్సిన నాయకుడే ఇలాంటి మాటలు మాట్లాడితే.. అవి కార్యకర్తలలో, అభిమానులలో అలజడి సృష్టించవా? విచక్షణ రహితంగా వాళ్లు తొందరపడి ఏదైనా చట్ట వ్యతిరేకమైన పనికి పాల్పడితే దాని పర్యవసానం ఎవరి ఎదుర్కొంటారు? బాబు మాటలు విన్న ప్రతి ఒక్కరి మనసులో మెదులుతున్న ఆలోచనలు ఇవే.
ఇటు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు టిడిపి కేడర్లో కూడా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. జగన్ తనని నమ్మితే.. తన వల్ల మంచి జరిగింది అని భావిస్తే ఓటు వేయండి అని ఒకపక్క మాట్లాడుతున్న సమయంలో.. చంపేస్తా, పొడి చేస్తా అంటూ చంద్రబాబు మాట్లాడడం పార్టీకే ముప్పు తెస్తుందని వారు భావిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఓడిపోతామేమో అన్న భయం బాబు చేత అలా మాట్లాడిస్తుందని మరికొందరు భావిస్తున్నారు.