సీఎం వైఎస్ జగన్ కు.. సీబీఐ షాక్
విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోరింది. అనంతరం తీర్పును న్యాయస్థానం ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు యూరప్ పర్యటనకు సీఎం అనుమతి కోరారు. లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో పర్యటించేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులతో గడిపేందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నేడు విచారణ పూర్తిచేసి తీర్పును వాయిదా వేసింది.
Tags :