అనిల్ కుమార్ చేసే వ్యతిరేక ప్రచారం ఎవరికోసం ?
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల.. ఎన్నికల ప్రచార నేపథ్యంలో అన్న జగన్ పై విరుచుకుపడడం కామనే. అయితే ఇప్పుడు ఆమె భర్త.. ప్రముఖ మత ప్రపోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఆమెకు తోడైనట్లు కనిపిస్తోంది. డైరెక్ట్ గా కాకపోయినా ఇన్డైరెక్టుగా జగన్ కు వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నారు. కడపలోని రాజారెడ్డి వీధిలో కృపా చర్చిలో ఈ రోజు బ్రదర్ అనిల్ కుమార్ సమావేశం నిర్వహించారు. మత ప్రచారాలు చేసే ఆయన రాజకీయాల గురించి కావాలనే మాట్లాడారు. తాము న్యాయం కోసం పోరాడుతున్న అని చెప్పిన అనిల్ కుమార్.. పాపాలు చేసిన వారిని తొక్కి పడేయండి అని పిలుపునిచ్చారు. పాపులను తరిమి కొడితే సరిపోదు.. ధైర్యంగా ఎదుర్కోవాలి అని అన్నారు. మీకు ఏసుప్రభువు అండగా ఉన్నాడు.. కాబట్టి ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు అని మాట్లాడారు. అయితే అన్యోపదేశంగా ఆయన జగన్ గురించి కావాలని ప్రజల్ని రెచ్చగొడుతున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇటు షర్మిల.. అటు ఆమె భర్త కుటుంబ కలహాలను రాజకీయ చర్చలుగా మారుస్తున్నారు. ఇటువంటి పరిణామాలు మంచిది కాదు అని రాజకీయ విశ్లేషకుల భావన.