ASBL NSL Infratech

ఆ నలుగురు బీజేపీ అభ్యర్థుల బీ-ఫామ్‌లు పెండింగ్..

ఆ నలుగురు బీజేపీ అభ్యర్థుల బీ-ఫామ్‌లు పెండింగ్..

ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరంలో బీజేపీ నలుగురు అభ్యర్థుల బీ-ఫామ్‌లు నిలిపివేయడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా. ఇప్పటికే బీజేపీ తరఫున చాలామంది నేతలు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నాలుగు నియోజకవర్గాలలో అభ్యర్థులకు మాత్రం బీజేపీ బీ-ఫామ్‌లు విడుదల పెండింగ్లో పెట్టింది. వారిలో హైదరాబాద్ లోక్ సభ అభ్యర్థి మాధవీలత కూడా ఉన్నారు. తన గెలుపు పై అత్యంత ధీమాతో ఉన్న మాధవీలత.. గత కొద్దికాలంకా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ప్రస్తుతం సడన్గా ఆమెకు బీ ఫామ్ ఇష్యూ చేయకుండా పెండింగ్ పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, మహబూబాబాద్ అభ్యర్థి సీతారాం నాయక్, నల్గొండ అభ్యర్థి సైదిరెడ్డిలకు ప్రస్తుతానికి బీ ఫామ్‌ను నిలిపివేసింది. అయితే దీని వెనుక అసలు కారణం ఏమిటి అన్న విషయం పై ఇంకా స్పష్టత లేదు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :