బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నిక ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా హనుమకొండ జిల్లా దామోరకు చెందిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేరు ఖరారైంది. ఈ మేరకు బీజేపీ ఎన్నికల కమిటీ అధికారికంగా ప్రకటించింది. 2021లో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీ ప్రేమేందర్ రెడ్డిని పోటీకి దింపగా ఓటమి పాలయ్యారు. మళ్లీ ఆయన్నే అభ్యర్థిగా బరిలోకి దింపారు. ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కాసం వెంకటేశ్వర్లు, ప్రకాశ్ రెడ్డి ప్రయత్నం చేయగా, వారిని కాదని గుజ్జుల పేరును ప్రకటించింది.
Tags :