ఏపీ నుంచి అమెరికాలో ఉద్యోగాలకు... 24 మంది ఎంపిక
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన 24 మంది విద్యార్థులకు అమెరికాకు చెందిన యునైట్ సంస్థలో ఉద్యోగాలు లభించాయి. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల నుంచి నలుగురు, మహిళా ఇంజినీరింగ్ కళాశాల నుంచి ఆరుగురు, ఏయూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి 14 మంది విద్యార్థులను ఈ సంస్థ ఎంపిక చేసింది. వీరికి ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి. ప్రసాద రెడ్డి సమక్షంలో యునైట్ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీధర్ అబ్బవరం నియామక పత్రాలు అందజేశారు.
Tags :