ఆ డంప్ ల వెనుక తాడేపల్లి పెద్దలు : అచ్చెన్నాయుడు
రేణిగుంట ఎఫ్సీఐ గోదాం వద్ద వైసీపీ నేతలు నగదు, మద్యం, ప్రచార సామగ్రికి సంబంధించిన డంప్లు బట్టబయలైనా ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటివి నాలుగు డంప్లు రేణిగుంటలో ఉన్న విషయాన్ని తమ పార్టీ నేతలు సాక్ష్యాధారాలతో సహా నిరూపించారన్నారు. అయినా అధికారులు స్పందించక పోవడం వెనుక తాడేపల్లి పెద్దల ఒత్తిళ్లు ఉన్న విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. ఈ డంప్ వెనుక ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చంద్రగిరి అభ్యర్థి మోహిత్ రెడ్డిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇద్దరినీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటిచాలని అన్నారు.
Tags :