ASBL NSL Infratech

ఓటర్లకు అభీబ‌స్ భారీ రాయితీ..

ఓటర్లకు అభీబ‌స్ భారీ రాయితీ..

ఎన్నికల నేపథ్యంలో ప్రైవేట్ బ‌స్ అగ్రిగేట‌ర్ అభీబ‌స్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లకు బంపర్ ఆఫర్ ఓటు వేయడానికి సొంత గ్రామాలకు తరలివెళ్ళి ఓటర్లకు 11 నుంచి 15 మధ్య అభీబ‌స్ టికెట్ పై 250 రూపాయల రాయితీ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలలో ఓటు వేయడం కోసం సొంత ఊరికి వెళ్లేవారు ఈ ఆఫర్ ని ఉపయోగించుకోవచ్చు అని అభీబ‌స్ సీఈవో లెనిన్ కోడూరు, సీవోవో రోహిత్ శ‌ర్మ ఓ ప్రకటనలో వెల్లడించారు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా యాప్ లో కనిపించే అభీఓట్ (ABHIVOTE) అనే కూప‌న్ ను అప్లై చేసుకోవడం. దీని ద్వారా కనీసం 20% వరకు మీరు డిస్కౌంట్ పొందగలుగుతారు. గరిష్టంగా మీరు కొనే టికెట్ ధరలో సుమారు 250 వరకు రాయితీ పొందుతారు. అంతేకాకుండా వంద రూపాయలు క్యాష్ బ్యాక్ కూడా పొందే అవకాశం ఉందట. ఈ క్యాష్ బ్యాక్ ను మీరు తర్వాత అభీ బస్సులో టికెట్ బుక్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ ఓటు వేయడానికి ఆంధ్ర కి వెళ్లే వారికి 10% రాయితీ ప్ర‌క‌టించింది.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :