సాయంత్రం వేళ టీతో తినేందుకు పునుగులు అంటే అందరికీ ఇష్టం. బయట స్టైల్లో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి.
దోశ పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, నూనె ఉంటే చాలు రుచికర పునుగులు సిద్ధం.
దోశ పిండిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి బాగా కలిపితే పునుగుల మిశ్రమం సిద్ధమవుతుంది.
కడాయిలో నూనెను మధ్యస్థ మంటపై వేడి చేయాలి. నూనె ఎక్కువ వేడిగా ఉంటే పునుగులు లోపల ఉడకవు.
చేతితో లేదా స్పూన్తో చిన్న ముద్దలుగా పిండిని నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ లేదా అల్లం చట్నీతో పునుగులు తింటే రుచి మరింత పెరుగుతుంది.
పిండిలో కొద్దిగా బియ్యంపిండి కలిపితే పునుగులు మరింత కరకరలాడుతూ రెస్టారెంట్ స్టైల్ రుచిని ఇస్తాయి.
తక్కువ నూనెతో పునుగులు చేయాలంటే పనియారం పాన్ ఉపయోగించండి. రుచి కూడా అలాగే ఉంటుంది.