22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,400 తగ్గింది. ప్రస్తుతం ధర సుమారు రూ.1,38,800 వద్ద ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,530 పడిపోయింది. నేడు తులం ధర రూ.1,51,420గా నమోదైంది.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండిపై రూ.10,000 వరకు తగ్గుదల కనిపించింది.
ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,55,000 వద్ద ఉంది. కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశం అని నిపుణులు చెబుతున్నారు.
ధరలు తగ్గడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగం కారణమైంది. అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపింది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ.13,880, 24 క్యారెట్లు రూ.15,142గా ఉన్నాయి. వెండి గ్రాము రూ.255.
విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. నిన్నతో పోలిస్తే ఇది మంచి అవకాశం.