భాగ్యనగరంలో నేడు గరిష్ట ఉష్ణోగ్రత 34°Cగా ఉండనుంది. సాయంత్రం వేళ ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, తేలికపాటి చినుకులు పడే అవకాశం ఉంది.
సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్ మరియు రంగారెడ్డి జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
ఏపీ రాజధాని అమరావతిలో నేడు గరిష్టంగా 36°C ఉష్ణోగ్రత నమోదు కావచ్చు. ఉదయం వేళ పొగమంచు కురిసే అవకాశం ఉంది, పగలు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది.
శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
నంద్యాల, అనంతపురం మరియు కర్నూలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 38°C దాటే అవకాశం ఉంది. ఎండ తీవ్రత పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన.
కోస్తా తీర ప్రాంతాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి.