నిపా వైరస్ చాలా అరుదుగా కనిపించినా, ప్రభావం తీవ్రమైన వ్యాధిగా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ వైరస్ ఎక్కువగా పండ్ల గబ్బిలాల ద్వారా మనుషులకు వ్యాపించే అవకాశాలు ఉన్నట్లు గుర్తించారు.
అకస్మాత్తుగా జ్వరం రావడం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కనిపించవచ్చు.
సరిగా కడగని పండ్లు లేదా కలుషితమైన ఆహారం తీసుకోవడం ప్రమాదాన్ని పెంచుతుంది.
ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలి.
సరైన జాగ్రత్తలు పాటిస్తే నిపా వైరస్ నుంచి మనల్ని మనమే కాపాడుకోవచ్చు.