21st July 2026

_________

- Saidulu

జగన్నాథ ఆలయంలో సైన్స్‌ను సైతం ఆశ్చర్యపరిచే మిస్టరీలు!

ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు... ఆధునిక సైన్స్, భౌతిక శాస్త్ర సూత్రాలకు అందని ఎన్నో వింతలు, విశేషాలకు నిలయం.

ఆలయ శిఖరంపై ఉండే నీలచక్రం మీది ధ్వజపటం ఎల్లప్పుడూ గాలి వీచే దిశకు విరుద్ధంగా (ఎదురుగా) ఎగురుతుంది. దీని వెనుక ఉన్న రహస్యం సైంటిస్టులకు కూడా ఇప్పటికీ చిక్కుముడే!

గాలికి ఎదురుగా ఎగిరే పతాకం

1,800 ఏళ్లుగా ప్రతిరోజూ ఒక పూజారి 45 అంతస్తుల ఎత్తు (సుమారు 214 అడుగులు) ఉన్న గోపురాన్ని ఎక్కి జెండాను మారుస్తారు. ఒక్క రోజు ఈ ఆచారం తప్పినా ఆలయం 18 ఏళ్ల పాటు మూతపడుతుందని నమ్ముతారు.

ప్రతిరోజూ జెండా మార్చే ఆచారం

రోజులో ఏ సమయంలోనైనా, సూర్యకాంతి ఎలా ఉన్నప్పటికీ పూరీ ప్రధాన ఆలయ గోపురం నీడ నేలపై ఎక్కడా కనిపించకపోవడం మరొక గొప్ప నిర్మాణ అద్భుతం.

నీడ పడని వింత!

ప్రపంచంలో ఎక్కడైనా పగటిపూట గాలి సముద్రం నుండి నేల వైపు, రాత్రివేళ నేల నుండి సముద్రం వైపు వీస్తుంది. కానీ పూరీలో మాత్రం దానికి కేవలం వ్యతిరేకంగా జరుగుతుంది!

గాలి దిశ మారే విచిత్రం

సాధారణంగా ఆలయ గోపురాలపై పక్షులు వాలుతుంటాయి. కానీ పూరీ జగన్నాథ ఆలయ గోపురం పైభాగంలో లేదా నీలచక్రంపై ఏ పక్షీ వాలదు, అంతేకాదు ఆలయం మీదుగా ఏ విమానం కూడా ఎగరదు.

పక్షులు వాలని ఏకైక గోపురం

ఆలయ సింహద్వారం వెలుపల సముద్రపు అలల హోరు స్పష్టంగా వినిపిస్తుంది. కానీ, సింహద్వారం గుండా ఆలయంలోకి ఒక్క అడుగు లోపలికి పెట్టగానే సముద్రపు శబ్దం పూర్తిగా మాయమవుతుంది.

సముద్ర హోరు వినపడని సింహద్వారం

ఆలయంలో ప్రతిరోజూ వేలాదిమంది నుండి లక్షలాదిమంది భక్తులకు వంట చేస్తారు. ఆశ్చర్యకరంగా ఇక్కడ తయారుచేసే ప్రసాదం ఏ ఒక్క రోజూ వ్యర్థం కాదు, అలాగని ఎవరికీ చాలకుండాపోదు.

చెడిపోని మహా ప్రసాదం

మహా ప్రసాదాన్ని కట్టెల పొయ్యిపై ఒకదానిపై ఒకటిగా మొత్తం 7 మట్టి కుండలను ఉంచి వండుతారు. అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే... అందరికంటే పైన ఉన్న కుండలోని అన్నం ముందుగా ఉడుకుతుంది!

వంట వండే విలక్షణ పద్ధతి

నమ్మకాలకు, విజ్ఞానానికి మధ్య ఒక అద్భుతమైన వంతెనలా నిలిచే పూరీ జగన్నాథ ఆలయం... ఇప్పటికీ మానవ మేధస్సుకు అందని దివ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది.