సామాజిక దూరంపై వీడియో ద్వారా చైతన్యపరుస్తున్న ఝాన్సీరెడ్డి
కరోనా మహమ్మారికి దూరంగా ఉండాలంటే సామాజిక దూరం పాటించడమే ముఖ్యమని, దాంతోపాటు ఇంట్లోనే ఉంటూ, భద్రంగా ఉండాలని ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా) అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి అన్నారు. ప్రజల్లో అవగాహనకోసం ఆమె ‘వేటా’ తరపున ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఇందులో ఝాన్సీరెడ్డితోపాటు, బేఏరియాలోని ఎన్నారైలు కూడా పాల్గొని ప్రజలు కరోనాకు దూరంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
Tags :