ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

మేలో న్యూజెర్సీలో జరిగే తెలుగు సభలకు టీటీఏ ఏర్పాట్లు

మేలో న్యూజెర్సీలో జరిగే తెలుగు సభలకు టీటీఏ ఏర్పాట్లు

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యూజెర్సిలో మే 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న మెగా కన్వెన్షన్‌కు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. న్యూజెర్సి కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పొజిషన్‌ సెంటర్‌లో ఈ కన్వెన్షన్‌ జరగనున్నది. ఇప్పటికే ఈ మెగా కన్వెన్షన్‌కోసం కమిటీలను నియమించినట్లు టిటిఎ అధ్యక్షుడు మోహన్‌ పాటలోళ్ళ తెలిపారు. ఈ కన్వెన్షన్‌కు కన్వీనర్‌గా శ్రీనివాస్‌ గనగోని వ్యవహరిస్తున్నారు. కన్వెన్షన్‌ అడ్వయిజరీ కమిటీలో టిటిఎ వ్యవస్థాపకులు డా. పైళ్ళ మల్లారెడ్డి, డా. విజయ్‌పాల్‌ రెడ్డి, డా. హరనాథ్‌ పొలిచెర్ల, డా. మోహన్‌ రెడ్డి పాటలోళ్ళ ఉన్నారు. బాంక్వెట్‌ కమిటీకి ఉషా చింత చైర్‌గా వ్యవహరిస్తున్నారు, బడ్జెట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కమిటికీ పవన్‌ కె రవ్వ చైర్‌గా వ్యవహరిస్తున్నారు. బిజినెస్‌ ఫోరం కమిటీకి మాణిక్యం చైర్‌గా, సిఇ`సిఎంఇ కమిటీకి డా. సునీత కనుమూరి చైర్‌గా, సెలబ్రిటీస్‌ కో ఆర్డినేషన్‌ కమిటీకి మహేష్‌ సంబు చైర్‌గా, కార్పొరేట్‌ స్పాన్సర్‌షిప్‌ కమిటీకి వెంకట్‌ ఎక్కా అడ్వయిజర్‌గా ఉన్నారు. కల్చరల్‌ కమిటీకి అశోక్‌ చింతకుంట చైర్‌గా వ్యవహరిస్తున్నారు. డెకరేషన్‌ కమిటీకి దీప జలగం అడ్వయిజర్‌గా ఉన్నారు. ఫుడ్‌ కమిటీకి విజయ్‌ భాస్కర్‌ చైర్‌గా, ఫండ్‌ రైజింగ్‌ కమిటీకి సురేష్‌ వెంకన్నగారి, హాస్పిటాలిటీ కమిటీకి శివారెడ్డి కొల్లా, ఇమ్మిగ్రేషన్‌ ఫోరం కమిటీకి అజయ్‌ రెడ్డి చైర్‌గా, మెట్రిమోనియల్‌ కమిటీకి సురేష్‌కుమార్‌ తండా చైర్‌గా, మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ కమిటీకి విలాస్‌ జంబుల చైర్‌గా, ఓవర్సీస్‌ కో ఆర్డినేషన్‌ కమిటీకి నవీన్‌ గోలి అడ్వయిజర్‌గా ఉన్నారు. పొలిటికల్‌ ఫోరం కమిటీకి సతీష్‌ మేకల చైర్‌గా, ప్రోగ్రామ్‌ అండ్‌ ఈవెంట్స్‌ కమిటీకి సుధాకర్‌ ఉప్పల, రిసెప్షన్‌ కమిటీకి కిరణ్‌, రిజిస్ట్రేషన్‌ కమిటీకి రూపక్‌ కల్లూరి చైర్‌గా వ్యవహరిస్తున్నారు. సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ కమిటీకి అరుణ్‌ చైర్‌గా, సావనీర్‌ కమిటీకి శ్రీనివాస్‌ గూడూరు, ఆధ్యాత్మిక కమిటీకి రామకృష్ణ సన్నిధి, ట్రాన్స్‌పోర్టేషన్‌ కమిటీకి రామ్మోహన్‌ చిన్నల, వెండర్‌ అండ్‌ ఎగ్జిబిట్స్‌ కమిటీకి నరేష్‌ చింతలచెరువు చైర్‌గా ఉన్నారు. వలంటీర్‌ కమిటీకి రంగారావు చైర్‌గా, వెబ్‌ కమిటీకి నరేందర్‌ రెడ్డి చైర్‌గా, ఉమెన్స్‌ ఫోరం కమిటీకి సంగీతారెడ్డి చైర్‌గా వ్యవహరిస్తున్నారు.

టాటా నుంచి టిటిఎగా పేరు మార్పు వెనక

తెలంగాణ తెలుగు అసోసియేషన్‌ను నిన్న మొన్నటివరకు టాటా పేరుతో వ్యవహరిం చేవారు. ఇటీవలికాలంలో టాటా పేరుకు బదులుగా టీటీఎగా మార్చుకున్నామని టిటిఎ ప్రెసిడెంట్‌ మోహన్‌ పాటలోళ్ళ తెలిపారు. దీనికి ముఖ్య కారణం ప్రముఖ కార్పొరేట్‌ సంస్థ టాటా వారు తమ పేరును వాడవద్దని చెప్పడంతో తాము తమ సంస్థను టీటిఎగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. మీడియాలోని ఇతరులు కాని తమ సంస్థ పేరును టీటిఎగానే వాడాలని ఆయన కోరారు.

టిటిఎ మెగా కన్వెన్షన్‌కు దేవిశ్రీ ప్రసాద్‌, సునీత

న్యూజెర్సిలో మే 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న మెగా కన్వెన్షన్‌లో ఎంతోమంది ప్రముఖులు వస్తున్నారు. రాజకీయ నాయకులతోపాటు, సినిమాతారలు, సంగీత కళాకారులు, సాహితీ వేత్తలు వస్తున్నారని టిటిఎ ప్రెసిడెంట్‌ మోహన్‌ పాటలోళ్ళ చెప్పారు. పలువురిని తాము ఆహ్వానిస్తున్నామని, ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ఈ కన్వెన్షన్‌కు రావడానికి ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశారని చెప్పారు. ప్రముఖ గాయని సునీత కూడా వస్తోందని తెలిపారు. ఇంకా ఎస్‌పి చరణ్‌, ఎస్‌పి శైలజ, ఉష, యాంకర్‌ సుమ తదితరులను ఆహ్వానించినట్లు చెప్పారు. టిటిఎ సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తూనే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారి కుటుంబీకుల కోసం ఓ పథకాన్ని కూడా తాము తీసుకువచ్చామని ఆయన చెప్పారు. ఈ పథకం ప్రకారం సభ్యుల కుటుంబీకులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటే హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రి సన్‌షైన్‌లో ఉచితంగానే ఆరోగ్య పరీక్షలు, డాక్టర్ల సలహాలను తీసుకోవచ్చని ఆయన చెప్పారు. కాగా నన్‌షైన్‌ ఆసుపత్రిలో మెజారిటీ వాటాను కిమ్స్‌ ఆసుపత్రి తీసుకున్న సంగతి తెలిసిందే.

 

Tags :