Radha Spaces ASBL

మదనపల్లిలో తానా - లోకేష్‌ కొణిదల సేవా కార్యక్రమాలు    

మదనపల్లిలో తానా - లోకేష్‌ కొణిదల సేవా కార్యక్రమాలు    

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు లోకేష్‌ కొణిదల ఆధ్వర్యంలో తానా చైతన్యస్రవంతి సేవా కార్యక్రమాలు మదనపల్లి పట్టణంలోని శేష సాయి కళ్యాణ మండపంలో ఘనంగా జరిగాయి. రెండురోజుల పాటు జరిగిన సేవా కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా వైభవంగా నిర్వహించారు.  
ఈ రెండు రోజుల కార్యక్రమంలో తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, పూర్వాధ్యక్షులు వేమన సతీష్‌,  కన్వెన్షన కన్వీనర్‌  రవి పొట్లూరి, చైతన్య స్రవంతి కోఆర్డినేటర్‌ సునీల్‌ పాంత్రాతోపాటు ఇతర స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

దివంగత ముఖ్యమంత్రి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి అంజలి ఘటించి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. తానా సాంసృతిక  కళోత్సవాలో భాగంగా ప్రముఖ సినీ గాయకులు  సింహ మరియు బృందం ప్రదర్శించిన మ్యూజికల్‌ నైట్‌ కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. మొదటి రోజు లోకేష్‌ నాయుడు దాతృత్వంతో ‘‘చేయూత’’ ‘‘ఆదరణ’’ కార్యక్రమాల ద్వారా పేద మహిళలకు 15లక్షల విలువైన కుట్టు మిషన్లు, విద్యార్థినులకు సైకిళ్ళు అందజేశారు ఎంపిక చేసిన లబ్ది దారులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. రెండో రోజు  గ్రేస్‌ ఫౌండేషన్‌  వారి సహకారంతో ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు  జరిగాయి. 

ఈ సందర్భంగా తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ తానా తరపున ముందు ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు  చేస్తామని తెలియచేశారు. లోకేష్‌ నాయుడు దాన గుణాన్ని కొనియాడారు.

మదనపల్లె పట్టణం నుంచి మరియు చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో  ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులు తమకు ఆర్థిక స్వావలంబన, సాధికారత దిశగా అవకాశం కల్పించిన లోకేష్‌ నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో డిసెంబర్‌ 2 నుండి, వచ్చే ఏడాది వరకు పేదల ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం, ఉపాధి రవాణా రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తానా చైతన్యస్రవంతి కో ఆర్డినేటర్‌ సునీల్‌ పంత్ర, 2023 మహాసభల కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ రవి పొట్లూరి తెలిపారు. లోకేష్‌ నాయుడు  ప్రసంగిస్తూ భవిష్యత్తులో కూడా తానా  ఫౌండేషన్‌ ద్వారా మదనపల్లె మరియు పరిసర ప్రాంత ప్రజలకు అవసరమైన సాధికారత,సేవా  కార్యక్రమాలు  నిర్వహించే ప్రణాళిక ఉందని  చెప్పారు.  

ఈ కార్యక్రమానికి వచ్చిన తానా ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని నిరంజన్‌ నాని, రాజేష్‌ రాటకొండ, పెరవలి నవీన్‌, వంశీ నరసింహ, మహేష్‌ రాటకొండ కో ఆర్డినేట చేసుకొని తమ సహకారం అందచేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె తెలుగు దేశం పార్టీ నాయకులు రాటకొండ బాబు రెడ్డి, జయరామ నాయుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చిన్నబాబు, నాదెండ్ల విద్యాసాగర్‌, మధుబాబు మస్తాన్‌, ప్రశాంత్‌ కొప్పారపు, తాజ్‌ ఖాన్‌, దొరస్వామి తదితరులు పాల్గొన్నారు.


 

Click here for Event Gallery

 

 

Tags :