Radha Spaces ASBL

ప్రధాని మోదీకి ఘన స్వాగతం

ప్రధాని మోదీకి ఘన స్వాగతం

భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్‌లోని జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ సందు, అమెరికా అధికారులు, ఆర్మీ బ్రిగేడియర్‌ అనూప్‌ సింగాల్‌, ఎయిర్‌ కమాండర్‌ అంజన్‌ భద్ర, నౌకాదళ కమాండర్‌ నిర్భయా బప్నా విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలికారు.  ప్రవాస భారతీయులు విమానాశ్రయం వద్ద త్రివర్ణ పతకాన్ని చేతపట్టుకుని ప్రధాని మోదీకి ఆహ్వానం పలికారు. వంద మందికి పైగా ప్రవాసులు ఎయిర్‌పోర్టుకి వచ్చారు. తన కోసం వేచి ఉన్న వారిని కలిసిన మోదీ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Click here to Photogallery

 

Tags :