Radha Spaces ASBL

అమెరికా పర్యటనకు బయలుదేరిన మోదీ

అమెరికా పర్యటనకు బయలుదేరిన మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు బయలుదేరారు. తన పర్యటనలో భాగంగా నేడు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో వాషింగ్టన్‌లో సమావేశం కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మోదీ రేపు సమావేశమవుతారు. ద్వైపాక్షిక సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు అఫ్ఘనిస్థాన్‌లోని పరిస్థితులు, ఉగ్రవాద నిరోధం వంటి పలు అంశాలపై మోదీ, బైడెన్‌  చర్చించనున్నారు. రేపు వాషింగ్టన్‌లో ఆస్ట్రేలియా, భారత్‌, జపాన్‌, అమెరికాల చతుర్భుజ భద్రతా కూటమి సదస్సులోనూ మోదీ పాల్గొంటారు. ఆయా దేశాల అధినేతలందరూ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. అనంరతం ఈ నెల 25న న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సర్వసభ సమావేశంలో మోదీ ప్రసంగిస్తారు. అనంతరం భారత్‌కు ఆదివారం (26వ తేదీన) వస్తారని హర్షవర్ధన్‌ శృంగ్లా తెలిపారు.

 

Tags :