Radha Spaces ASBL

అమెరికా సీఈవోలతో ప్రధాని మోదీ భేటీ

అమెరికా సీఈవోలతో ప్రధాని మోదీ భేటీ

అమెరికాకు చెందిన చమురు, సహజ వాయువు రంగ కంపెనీల సీఈవోలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భారత్‌లో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చే లక్ష్యంతో ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంపై వారితో చర్చించారు. ఇంధన భద్రత, భారత్‌-యూఎస్‌ మధ్య పరస్పర పెట్టుబడి అవకాశాల పెంపుపై మాట్లాడారు. మొత్తం 17 సంస్థల సీఈవోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారత ఆర్థిక సరళీకరణ విధానాలను సీఈవోలు ప్రశంసించారు.

 

 

Tags :