ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

క్యూరియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ పాండియన్ తో మంత్రి కేటీఆర్ సమావేశం

క్యూరియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ పాండియన్ తో మంత్రి కేటీఆర్ సమావేశం

న్యూయార్క్ కేంద్రంగా ఉన్న క్యూరియా గ్లోబల్ హైదరాబాద్ లోని తన కేంద్రంలో పనిచేసే ఉద్యోగులను రాబోయే 12 నెలల్లో రెట్టింపు చేసే ఆలోచనలో ఉంది. ఇప్పటికే మన దేశంలో ఈ కంపెనీ 27 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఇతర క్యూరియా గ్రూప్ సంస్థలు, థర్ట్ పార్టీ సంస్థల కోసం ఔషధ రసాయన శాస్త్రంలో తయారీ, ఒప్పంద పరిశోధన కార్యకలాపాలను ఈ సంస్థ నిర్వహిస్తుంది. క్యూరియా గ్లోబల్ వనరులతో మన దేశంలోని ఆ సంస్థ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఔషధ రసాయన శాస్త్రంలో ఈ గ్రూప్ కు మంచి గుర్తింపు ఉంది.

క్యూరియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ప్రకాష్ పాండియన్ తో మంత్రి కేటీఆర్ సమావేశం తరువాత కంపెనీ ఈ ప్రకటన చేసింది. హైదరాబాద్ లోని గ్లోబల్ షేర్డ్ సర్వీస్ సెంటర్ లో ప్రస్తుతం 115 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, రాబోయే 12 నెలల్లో మరో 100 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ పాండియన్ తెలిపారు.

ఈ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ క్యూరియా గ్లోబల్ అసాధారణ ఎదుగుదల, దాని విస్తరణ ప్రణాళికలు తనకు సంతోషాన్ని కలిగించాయన్నారు. క్యూరియా గ్రూప్ దార్శనికత, లక్ష్యాన్ని సాధించడంలో హైదరాబాద్ లోని గ్లోబల్ షేర్డ్ సర్వీసెస్, R&D కమ్ మాన్యుఫాక్చరింగ్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తాయన్న నమ్మకం తనకు ఉందన్నారు. క్యూరియా గ్రూప్ కు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని కేటీఆర్ తెలిపారు.

 

Tags :