Radha Spaces ASBL

కృష్ణా జిల్లా అనుబంధమే నన్ను అధ్యక్షుడిని చేసింది...సతీష్‌ వేమన

కృష్ణా జిల్లా అనుబంధమే నన్ను అధ్యక్షుడిని చేసింది...సతీష్‌ వేమన

తానా 22వ మహాసభల్లో భాగంగా వాషింగ్టన్‌ డీసీలోని వాల్టర్‌ ఇ కన్వెన్షన్‌ సెంటర్‌లో కృష్ణా జిల్లా ఎన్నారైల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్‌ వేమన మాట్లాడుతూ, తానాలో ప్రవేశానికి ఎంతో కష్టపడ్డానని చెప్పారు. తానాలో వాషింగ్టన్‌ డీసీ ప్రాంతీయ ప్రతినిధిగా బరిలో దిగేందుకు నామినేషన్‌ సమర్పించే సమయంలో తన సతీమణి నీలిమ చనుమోలు పేరును కూడా జత చేశానని, అప్పటివరకు వీడెవడో రాయలసీమ హడావుడి అభ్యర్థి అనుకున్న వారంత కృష్ణాజిల్లాకు సొంతమైన ఇంటిపేరును చూసి తన నామినేషన్‌ను పరిశీలనకు తీసుకున్నారని, ఆనాడు అది రాయకుండా ఉండి ఉంటే నేను ఇవాళ తానా అధ్యక్షుడిని అయ్యేవాడినే కాదని సతీష్‌ వేమన చెప్పారు.

బెజవాడ బ్లడ్‌ బాయిలింగ్‌ పాయింట్‌ వేరు అని, ఆ నీళ్లు, ఆ ఊళ్లు అదొక రకమైన్‌ ఊపులో ఉంటాయని ఆయన ప్రశంసలు కురిపించారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ గుడివాడ మధ్యలో నుండి 50కి.మీ మేర ఒక వ త్తాన్ని గీస్తే ప్రపంచ పటాన తెలుగు వారికి తెలుగు జాతికి తెలుగు ఖ్యాతికి కారకులైన వారి పేర్లు కనిపిస్తాయని చెప్పారు.

తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి మాట్లాడుతూ కృష్ణా జిల్లా వాళ్లని చూసి మిగతా 12 జిల్లాల వారు నిత్యం అసూయ పడుతుంటారని అన్నారు. కెనడాలో మంత్రిగా పనిచేస్తున్న పాండా ప్రసాద్‌ మాట్లాడుతూ తాను కెనడాలో సిక్కుల ఖలిస్థానీ ఉద్యమాన్ని నియంత్రించేందుకు సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీ రోజుల్లో లగడపాటి రాజగోపాల్‌తో కలిసి చేసిన రాజకీయాలే తనకు ఉపయోగపడ్డాయని చెప్పారు.

తానా తదుపరి అధ్యక్షుడు జే తాళ్ళూరి మాట్లాడుతూ, తాను కృష్ణా జిల్లా మనవడిని అని గర్వంగా చెబుతానన్నారు. సినీ నిర్మాత నవీన్‌ ఎర్నేని, రవి మందలపు, యార్లగడ్డ రత్నకుమార్‌, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, లావు అంజయ్యచౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి మధు నెక్కంటి కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. 

Click here for Event Gallery

Tags :