సూర్యాపేట జిల్లా ప్రజలకు తీపి కబురు.. త్వరలో
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ప్రజలకు తీపికబురు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేసిన కృషి ఫలించబోతుంది. జిల్లా కేంద్రంలో త్వరలో ఐటీ హబ్ ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ మేరకు సూర్యాపేటలో ఐటీ హబ్ ప్రారంభించబోతున్నట్లు అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కాలిఫోర్నియాలో ప్రకటించారు. అందుకు గాను గ్లోబల్ ఐటీ సంస్థతో పాటు మరిన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.
Tags :