Radha Spaces ASBL

సూర్యాపేట జిల్లా ప్రజలకు తీపి కబురు.. త్వరలో

సూర్యాపేట జిల్లా ప్రజలకు తీపి కబురు.. త్వరలో

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ప్రజలకు తీపికబురు. రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి చేసిన కృషి ఫలించబోతుంది. జిల్లా కేంద్రంలో త్వరలో ఐటీ హబ్‌ ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ మేరకు సూర్యాపేటలో ఐటీ హబ్‌ ప్రారంభించబోతున్నట్లు అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ కాలిఫోర్నియాలో ప్రకటించారు. అందుకు గాను గ్లోబల్‌ ఐటీ సంస్థతో పాటు మరిన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.

 

Tags :