Radha Spaces ASBL

కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణానికి చర్యలు చేపట్టండి - జగన్

కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణానికి చర్యలు చేపట్టండి - జగన్

కొత్త మెడికల్‍ కళాశాలల నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍మోహన్‍రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడు కార్యక్రమాలపై సమీక్షించారు. ఆసుపత్రుల నాడు-నేడు కింద చేపట్టే పనులకు జూన్‍ మొదటివారంలో టెండర్లకు వెళ్లాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు-నేడు కింద వైద్య రంగంలో అభివృద్ధి పనులు, కొత్త నిర్మాణాల కోసం దాదాపు రూ.16వేల కోట్లు ఖర్చువుతుందని సీఎం తెలిపారు.

 నాడు- నేడు కింద చేపట్టే పనులు ఇప్పటివారికే కాదని.. భవిష్యత్తు తరాలకూ సంబంధించిందని సీఎం పేర్కొన్నారు. వీటి వల్ల ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా.. ప్రజలను రక్షించడానికి ఉపయోగపడతాయని.. అందుకే నాడు-నేడు కింద చేపట్టే పనుల్లో నాణ్యత ఉండాలని.. మంచి వ్యూహాలను ఎంపిక చేసుకోవాలని సీఎం సూచించారు. ఆంధప్రదేశ్‍లో ఈ పనులు చరిత్రాత్మకం కావాలన్నారు. ఏ ప్రభుత్వం కూడా ప్రజారోగ్య వ్యవస్థ గురించి ఆలోచించడం లేదని.. రూ.16వేల కోట్లు ఖర్చుచేయబోతున్నామని సీఎం స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడు కార్యక్రమాల కింద చేపట్టే పనులకు ప్రజలు, ఈ దేశం మద్దతుగా నిలబడుతుందని సీఎం వైఎస్‍ జగన్‍ పేర్కొన్నారు.

 

Tags :