Radha Spaces ASBL

రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో ఆకట్టుకున్న ఎన్నారై విద్యార్థుల అవధానం

రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో ఆకట్టుకున్న ఎన్నారై విద్యార్థుల అవధానం

అమెరికాలో ప్రజ్ఞ కోర్సు ద్వారా శిక్షణ పొందిన ఎనిమిది మంది ప్రవాస భారతీయ విద్యార్థులతో చినజీయర్‌ స్వామి చేపట్టిన అవధాన కార్యక్రమం భక్తుల్ని మంత్రముగ్ధులను చేసింది. ప్రవచన మండపంలో జరిగిన ఈ అవధానాన్ని భగవద్గీత శ్లోకాలతో మొదలుపెట్టారు. ఒకరి తర్వాత ఒకరిగా.. ప్రతి శ్లోకం చివరి అక్షరంతో మొదలయ్యే మరో శ్లోకాన్ని అందుకుంటూ, దాని అర్థాన్ని వివరిస్తూ వచ్చారు. కార్యక్రమం అనంతరం ప్రవాస విద్యార్థులు అభిరాం, అముక్త మాల్యద, అనిరుధ్‌, కోవిద, మహేశ్వరి, మాధవప్రియ, వేద, శ్రీలతలను చినజీయర్‌ స్వామి ఆశీర్వదించి, సమతామూర్తి ప్రతిమలను బహుకరించారు.

 

Tags :