Radha Spaces ASBL

ఆటా ఉగాది సాహిత్య వేదిక

ఆటా ఉగాది సాహిత్య వేదిక

అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ ఉగాది సాహిత్య వేదిక కార్యక్రమం ఏప్రిల్‌ 2వ తేదీన నిర్వహించారు. ఉగాది పండుగ రోజునే నిర్వహించిన ఈ సాహితీ కార్యక్రమంలో పలువురు సాహితీ వేత్తలు పాల్గొన్నారు. శుభకృతునామ సంవత్సర సాహితీ సౌరభం అంటూ సాగిన ఈ కార్యక్రమం ఆన్‌లైన్‌లో వర్చ్యువల్‌గా జరిగింది. శంకరమంచి రామకృష్ణ శాస్త్రి, వర్దిపర్తి పద్మాకర్‌, తనికెళ్ళ భరణి, మారుమాముల వెంకట రమణ మూర్తి, బలభద్రపాత్రుని రమణి వంటి ప్రముఖ సాహితీవేత్తలు పాల్గొన్నారు. కృష్ణవేణి మల్లావజ్జల వ్యాఖ్యాతగా సాగిన ఈ సాహితీ కార్యక్రమంలో ఆటా బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీ శారద సింగిరెడ్డి స్వాగతోపన్యాసం చేసి అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆటా’ అధ్యక్షులు భువనేష్‌ బుజాల ఆహూతులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపి ఆటా చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు.  జూలై 1-3, 2022 జరగనున్న 17వ మహాసభలకు అందరినీ సాదరంగా ఆహ్వానించారు.

 

Tags :