బాధితులు రీఓపెన్ చేయాలని కోరితే... తప్పకుండా చేస్తాం : హోంమంత్రి అనిత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టానని వంగలపూడి అనిత అన్నారు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. తనను ఆశీర్వదించిన పాయకరావుపేట ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. నాపై పెట్టిన గురుతర బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తామన్నారు. గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపిస్తాం. బాధితులు కేసులు రీఓపెన్ చేయాలని కోరితే తప్పకుండా చేస్తాం అని తెలిపారు. దిశ పోలీస్స్టేషన్ల పేరు మారుస్తామన్నారు. పోలీసుల్లో గత ప్రభుత్వ ఆలోచనలతో ఉన్నవారు పక్కకు తప్పుకోవాలి. ప్రజలకు అనుకూలంగా పోలీసులు పనిచేయాలి. సోషల్ మీడియాలో మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ రవాణా చాలా మేరకు తగ్గిస్తామన్నారు.
Tags :