ASBL Koncept Ambience
facebook whatsapp X

అఫిడవిట్లలో తప్పుడు సమాచారంపై కేటీఆర్‌కు హైకోర్టు నోటీసులు

అఫిడవిట్లలో తప్పుడు సమాచారంపై కేటీఆర్‌కు హైకోర్టు నోటీసులు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఎన్నికల అఫిడవిట్లలో కేటీఆర్ తప్పుడు సమాచారం ఇచ్చాడని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాసులు హైకోర్టులో ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్లలో కేటీఆర్ తప్పుడు సమాచారం ఇచ్చారని ఆ పిటిషన్లలో తీవ్రమైన ఆరోపణలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు.. ఈ విషయంలో కేటీఆర్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, సిరిసిల్ల రిటర్నింగ్ ఆఫీసర్‌కు నోటీసులు జారీ చేశారు. నాలుగు వారాల్లో ఈ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :