అమెరికాలో హిందువులపై దాడులు పెరిగాయ్ : శ్రీ తానేదార్ ఆందోళన
అమెరికాలో హిందువులు, హిందూ ప్రార్థనా స్థలాలపై దాడులు గణనీయంగా పెరిగాయని ఇండో`అమెరికన్ చట్టసభ సభ్యుడు ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులకు వ్యతిరేకంగా సమన్వయంతోనే ఈ తరహా దాడులు జరుగుతున్నాయి, ఇది ఆరంభం మాత్రమేనని చట్టసభ సభ్యుడు శ్రీ తానేదార్ హెచ్చరించారు. అమెరికాలో నేడు హిందువులపై దాడులు గణనీయంగా పెరగడాన్ని చూస్తున్నా, ఆన్లైన్లో మరోవిధంగా భారీ స్థాయిలో అస్యత ప్రచారం సాగుతోంది. సమన్వయంతో ఈ తరహా దాడులు జరుగుతున్నాయని అనిపిస్తోంది. దీనికి వ్యతిరేకంగా కలసికట్టుగా ముందుకు సాగాలి. సమయం ఆసన్నమైంది. ఇందుకు నా మద్దతు ఉంటుంది అని నేషనల్ ప్రెస్క్లబ్లో హిందూయాక్షన్ అనే స్వచ్ఛందసంస్థ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తానేదార్ పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా దాడులకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకపోవడంతో పాటు ఇప్పటికీ ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. కాలిఫోర్నియా, న్యూయార్క్తో సహా అమెరికా వ్యాప్తంగా ఇలాంటి దాడులు చూస్తున్నామని పేర్కొన్నారు. స్థానిక దర్యాప్తు సంస్థలు విచారణ మొదలు పెడుతున్నప్పటికీ వాటిపై పురోగతి ఉండటం లేదని ఆరోపించారు.