ASBL Koncept Ambience
facebook whatsapp X

టెక్సాస్ లో రామోజీరావు సంస్మరణ సభ... నివాళులర్పించిన ప్రవాసాంధ్రులు

టెక్సాస్ లో రామోజీరావు సంస్మరణ సభ... నివాళులర్పించిన ప్రవాసాంధ్రులు

పాత్రికేయ రంగంలో రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్‌ రామోజీరావు ధ్రువతారగా నిలుస్తారని ప్రవాసాంధ్రులు కొనియాడారు. ఆయన ఏ వ్యాపారం చేసినా అందులో సమాజ హితమే కోరుకున్నారని ప్రశంసించారు. అమెరికాలో టెక్సాస్‌ రాష్ట్రం ఆస్టిన్‌ నగరంలో జరిగిన రామోజీరావు సంస్మరణ సభలో పలువురు పాల్గొని నివాళులు అర్పించారు. క్రమశిక్షణ, అత్యున్నత ప్రమాణాలు పాటించాలనే ఆయన పట్టుదలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని రాయపాటి సుబ్రహ్మణ్యం నాయుడు, తుమ్మల ఉమాపతి పేర్కొన్నారు. సభలో పసులూరి సుమంత్‌, గూడూరి శ్రీనివాస్‌, పాతూరి కోటేశ్వరరావు, వేములపల్లి భాను, కొత్త రవి తదితరులు పాల్గొన్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :