ASBL Koncept Ambience
facebook whatsapp X

కోలాహలం.. ఏపీలో ఒకేరోజు 8 మంది మంత్రుల.. బాధ్యతల స్వీకరణ

కోలాహలం.. ఏపీలో ఒకేరోజు 8 మంది మంత్రుల.. బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, సందర్శకులతో కిటకిటలాడింది. సచివాలయంలో ఒకేరోజు ఏడుగురు మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్‌, కందుల దుర్గేశ్‌, వాసంశెట్టి సుభాష్‌, టీజీ భరత్‌, ఎస్‌. సవిత, కొండపల్లి శ్రీనివాస్‌ బాధ్యతలు స్వీకరించారు. గొల్లపూడిలోని దేవదాయశాఖ కమిషనరేట్‌లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బాధ్యతలు చేపట్టారు. కీలక అంశాలకు సంబంధించిన దస్త్రాలపై మంత్రులు తొలి సంతకాలు చేశారు. అనంతరం మీడియతో మాట్లాడారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :