ASBL Koncept Ambience
facebook whatsapp X

తెలంగాణలో ఏరోస్సేస్ సంస్థ పెట్టుబడులు

తెలంగాణలో ఏరోస్సేస్ సంస్థ పెట్టుబడులు

ఏరోస్పేస్‌, రక్షణ వ్యవస్థలకు సంబంధించిన విడిభాగాలను ఉత్పత్తి చేసే అమెరికాకు చెందిన ప్రసిద్ధ కంపెనీ ది లాక్‌హీడ్‌ మార్టిన్‌ తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబర్చింది. ఇప్పటికే హైదరాబాద్‌ శివారులోని ఆదిభట్లలో ఈ సంస్థ తమ కార్యకలాపాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. కంపెనీ ఇండియా హెడ్‌ ఫెర్నాండేజ్‌ సహా పలువురు ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని మరిన్ని పెట్టుబడులకున్న అవకాశాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, దుదిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :