తెలంగాణలో ఏరోస్సేస్ సంస్థ పెట్టుబడులు
ఏరోస్పేస్, రక్షణ వ్యవస్థలకు సంబంధించిన విడిభాగాలను ఉత్పత్తి చేసే అమెరికాకు చెందిన ప్రసిద్ధ కంపెనీ ది లాక్హీడ్ మార్టిన్ తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబర్చింది. ఇప్పటికే హైదరాబాద్ శివారులోని ఆదిభట్లలో ఈ సంస్థ తమ కార్యకలాపాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. కంపెనీ ఇండియా హెడ్ ఫెర్నాండేజ్ సహా పలువురు ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని మరిన్ని పెట్టుబడులకున్న అవకాశాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుదిళ్ల శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Tags :