తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ జరిగింది. 20 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా జిల్లాలకు నూతన కలెక్టర్లను నియమించింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్ది రోజులకు తాత్కాలిక బదిలీలు జరిపింది. గత ప్రభుత్వ హయాంలో పలు స్థానాల్లో ఉన్నవారిని మార్చింది. అనంతరం లోక్సభ ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమల్లోకి రావడంతో బదిలీలు నిలిచిపోయాయి. ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా పెద్దఎత్తున మార్పులు చేసింది.
కొత్త కలెక్టర్లు వీరే....
ముజామిల్ ఖాన్ ఖమ్మం జిల్లా కలెక్టర్గా, సంతోష్ నాగర్కర్నూల్ కల్క్టర్గా, రాహుల్ శర్మ భూపాలపల్లి కలెక్టర్గా, అనురాగ్ జయంతి కరీంనగర్ కలెక్టర్గా, కోయ శ్రీహర్ష పెద్దపల్లి కలెక్టర్గా, సత్య ప్రసాద్ జగిత్యాల కలెక్టర్గా, కుమార్ దీపక్ మంచిర్యాల కలెక్టర్గా, విజయేంద్ర మహబూబ్నగర్ కలెక్టర్గా, ప్రావీణ హనుమకొండ కలెక్టర్గా, సిక్తా పట్నాయక్ నారాయణపేట్ కలెక్టర్గా, సందీప్కుమార్ రaా సిరిసిల్లా కలెక్టర్గా, జితేష్ వి పాటిల్ భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్గా, ప్రతీక్ జైన్ వికారాబాద్ కలెక్టర్గా, ఆవిష్ సంగ్వాన్ కామారెడ్డి కల్క్టర్గా, నారాయణ రెడ్డి నల్గొండ కలెక్టర్గా, ఆదర్శ్ సురభి వనపర్తి కలెక్టర్గా, తేజస్ నందలాల్ పవార్ సూర్యాపేట కలెక్టర్గా, సత్య శారదాదేవి వరంగల్ కలెక్టర్గా, దివాకరా ములుగు కలెక్టర్గా, అభిలాష అభివన్ నిర్మల్ కలెక్టర్గా నియమితులయ్యారు.