శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరోసారి.. బాంబు బెదిరింపు
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన భద్రత అధికారులు, సీఐఎస్ఎఫ్ అధికారులు విసృతంగా తనిఖీలు నిర్వహించారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఎయిర్పోర్టు అధికారిక ఈ మెయిల్కు బెదిరింపు మెసేజ్ రావడంతో వెంటనే భద్రత అధికారులు ఎయిర్పోర్టుకు వచ్చే ప్రయాణికులతో పాటు వాహనాలకు విసృతంగా తనిఖీలు చేశారు. చివరికి ఏం లేదని తెలపడంతో ఎయిర్పోర్టు భద్రత అధికారులు ఊపిరిపిల్చుకున్నారు. ఎయిర్పోర్టు అధికారిక ఈ మెయిల్కు వచ్చిన మెసేజ్పై ఆరా తీస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు బెదిరింపు మెసేజ్ వచ్చిన దానిపై ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags :