ASBL Koncept Ambience
facebook whatsapp X

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట... ఇప్పుడు ఒక మాట

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట... ఇప్పుడు ఒక మాట

కాంగ్రెస్‌ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట చెబుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.  తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ కార్యాలయానికి గ్రూప్స్‌ అభ్యర్థులు వచ్చి వినతి పత్రం ఇచ్చారని తెలిపారు. గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 చొప్పున పోస్టులు తీయాలని అభ్యర్థులు కోరుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు విపక్షంలో ఉన్నప్పుడు 1:100 చొప్పున తీయాలని యువతను రెచ్చగొట్టారని విమర్శించారు. ఇప్పుడు ఆ ప్రకారం ఎందుకు తీయడం లేదని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ నేతలు గ్రూప్స్‌ పోస్టులు పెంచాలని అడిగారు. ఇప్పుడు పోస్టులు పెంచాలని అభ్యర్థులు కోరితే స్పందించట్లేదు. గ్రూప్స్‌లో పరీక్షలకు మద్య వ్యవధి ఉండాలని అభ్యర్థులు కోరుతున్నారు. ప్రభుత్వాన్ని నిలదీయాలని మా వద్దకు వచ్చి కోరారు. జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారు? మెగా డీఎస్సీ కింద రూ.25 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలి అని డిమాండ్‌  చేశారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :