ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ద్వారకా తిరుమలరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు చేపట్టారు. కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. పోలీసుల గౌరవందనం స్వీకరించారు. ఆ తర్వాత నూతన డీజీపీగా సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఏడీజీ శంకరబత్ర బాగ్చీ, కేఎల్ మీనా, అతుల్ సింగ్, ఐజీ వినీత్ బ్రిజ్ లాల్, శ్రీకాంత్, డీఐజీ రాజకుమారి, నవీన్ జెట్టి, మోహన్ రావు తదితరులు ద్వారకా తిరుమలరావుకు అభినందనలు తెలిపారు.
Tags :