ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని.. డీజీపీకి స్పష్టం చేసిన చంద్రబాబు
సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమలరావు భేటీ అయ్యారు. బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో యువతి హత్య ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని డీజీపీ సీఎంకు వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. త్వరలోనే పోలీస్ యంత్రాంగం ప్రక్షాళన ఉంటుందని డీజీపీకి స్పష్టం చేశారు. ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధానత్య అని చంద్రబాబు వెల్లడిరచారు. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలిచ్చారు. ఈపూరుపాలెం ఘటనలో దోషులకు కఠిన శిక్ష పడేలా వ్యవహరించాలని ఆదేశించారు.
Tags :