వైఎస్ జగన్ కు షాక్.. లోటస్ పాండ్ వద్ద
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్లోని నివాసం ముందున్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. లోటస్ పాండ్ వద్ద అక్రమంగా నిర్మించిన పోలీస్ సెక్యూరిటీ షెడ్లను జీహెచ్ఎంసీ తొలగించింది. రహదారికి అడ్డుగా ఉన్నాయన్న ఫిర్యాదుతో జీహెచ్ఎంసీ అధికారులు మూడు షెడ్లను కూల్చేశారు. అక్రమ నిర్మాణాలు తొలగించాలని లోటస్ పాండ్ సిబ్బందికి జీహెచ్ఎంసీ, పోలీసులు నిన్ననే ఆదేశాలు జారీ చేశారు. రహదారి పక్కనే అక్రమ నిర్మాణాలతో రాకపోకలకు ఇబ్బంది మారిందని ఫిర్యాదు అందడంతో ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
Tags :