ASBL Koncept Ambience
facebook whatsapp X

రాజధాని శంకుస్థాపన ప్రదేశంలో ప్రణమిల్లిన సీఎం చంద్రబాబు

రాజధాని శంకుస్థాపన ప్రదేశంలో ప్రణమిల్లిన సీఎం చంద్రబాబు

రాజధాని ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని సీఎం తెలుసుకున్నారు. అమరావతి నిర్మాణాల పరిశీలనలో భాగంగా ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరారు. తొలుత ప్రజావేదిక శిథిలాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయునిపాలెం వెళ్లారు. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. ఆ ప్రదేశంలో ప్రణమిల్లారు. మోకాళ్లపై కూర్చొని నమస్కరించారు. గతంలో సేకరించిన మట్టికి అక్కడ పూజలు చేశారు.

రాజధాని ప్రాంతంలో సీఎం పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున అమరావతి ప్రాంత రైతులు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. జై చంద్రబాబు, జై అమరావతి నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. శంకుస్థాపన ప్రాంత పరిశీలన అనంతరం సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులు నారాయణ, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, కొలికపూడి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :