చంద్రబాబు శపథం నెరవేరిన వేళ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వైసీపీ నేతలు తీవ్రంగా కించపరచడంతో ముఖ్యమంత్రిగా మళ్లీ అడుగుపెడతానని 2021లో ఆయన శపథం చేశారు. అది నేడు నెరవేరింది. సమావేశాల ప్రారంభం నేపథ్యంలో అసెంబ్లీకి చంద్రబాబు వచ్చారు. తొలుత అక్కడి మెట్ల వద్ద ప్రణమిల్లి లోపలికి అడుగు పెట్టారు. అనంతరం శాసనసభాపక్ష నేత కార్యాలయంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత శాసనసభకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నిజం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఆలింగనం చేసుకున్నారు.
Tags :