ASBL Koncept Ambience
facebook whatsapp X

బీజేపీ అంగీకరిస్తే అవినాష్ రెడ్డి మినహా.. వైసీసీ ఎంపీలంతా

బీజేపీ అంగీకరిస్తే అవినాష్ రెడ్డి మినహా.. వైసీసీ ఎంపీలంతా

వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి బీజేపీలో చేరేందుకు అగ్ర నాయకత్వంతో టచ్‌లోకి వెళ్లారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఖాళీ అవడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. బీజేపీ అంగీకరిస్తే అవినాష్‌ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ, బీజేపీ నాయకత్వం వాళ్లు అక్కర్లేదని అంటోంది. అయినా మేం చేరతామంటూ మిథన్‌ రెడ్డి ఇంకా లాబీయింగ్‌ చేస్తున్నారు. బీజేపీలో చేరాలని ఆయన తండ్రి పెద్దిరెడ్డి మీద కూడా ఒత్తిడి తెస్తున్నారు. ఓదార్పు యాత్ర కోసం జగన్‌ మళ్లీ 14 కారణాలు వెతుక్కుంటున్నారు. చెల్లి వల్లే నష్టపోయామని జగన్‌ తెలుసుకున్నాడు. చెల్లితో రాజీ చేయాలని తల్లిని కోరాడు. అన్ననే వచ్చి కాంగ్రెస్‌లో చేరాలని షర్మిల చెప్పేసింది. త్వరలోనే వివేకా హత్య కేసులో అవినాష్‌ రెడ్డి అరెస్టవుతారు. కడప ఉప ఎన్నికల్లో భూపేశ్‌ రెడ్డి టీడీపీ తరపున పోటీ చేసి గెలుస్తారు అని అన్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :