ASBL Koncept Ambience
facebook whatsapp X

అమెరికాలో కాల్పులు ..బాపట్ల జిల్లా యువకుడి మృతి

అమెరికాలో కాల్పులు ..బాపట్ల జిల్లా యువకుడి మృతి

అమెరికాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలికి చెందిన దాసరి శ్రీనివాసరావు, ధనలక్ష్మిల కుమారుడు గోపీకృష్ణ (32). బీటెక్ చదిన ఆయన ఉద్యోగం నిమిత్తం ఎనిమిది నెలల క్రితం అమెరికా వెళ్లారు. టెక్సాస్ రాష్ట్రం డాలస్లోని ఓ సూపర్ మార్కెట్లో పని చేస్తున్నారు. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్లో ఉండగా, ఓ దుండగుడు తుపాకీతో అతడిపై కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గోపీకృష్ణ మృతి చెందారు. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి భార్య ప్రవల్లిక, ఏడాది కుమారుడు రిషిత్ ఉన్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :