చిరంజీవితో కేంద్రమంత్రి బండి సంజయ్ భేటీ
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రముఖ నటుడు చిరంజీవితో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని తన నివాసానికి మర్యాదపూర్వకంగా విచ్చేసిన సంజయ్ను చిరంజీవి శాలువా కప్పి సన్మానించారు. సుమారు అరగంట సేపు రాష్ట్ర, దేశ రాజకీయాలతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కష్టపడి పైకొచ్చిన సంజయ్కు కేంద్ర మంత్రిగా గుర్తింపు లభించిందన్నారు. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రధాని మోదీ తనను దగ్గరకు తీసుకుని పలకరించడం మర్చిపోలేని అనుభూతిగా మిగిలిందని పేర్కొన్నారు. సంజయ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే తాను చిరంజీవి అభిమానినని తెలిపారు. ఏపీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి మంచి ఫలితాలు సాధించిందని, ప్రజలకు మంచి పాలన అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags :