సైబరాబాద్ లో దక్షిణ కొరియా అంబాసిడర్
పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పనిచేయడం చాలా బాగుందని దక్షిణ కొరియా అంబాసిడర్ చాంగ్ జెబొకా అన్నారు. దక్షిణ కొరియా అంబాసిడర్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఎస్సిఎస్సి ప్రతినిధులు, సిసి అవినాష్ మహంతితో భేటీ అయ్యారు. దక్షిణ కొరియా బెటర్ ట్రాఫిక్ వ్యవస్థ ఉందని చాంగ్ అన్నారు. ఇక్కడి నుంచి మంచి డ్రైవింగ్ ఎక్స్పీ రియన్స్ను నేర్చుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి మాట్లాడుతూ తాను డిసిపిగా ఉన్నప్పటి నుంచి ఎస్సిఎస్సిని చూస్తున్నానని తెలిపారు. గత 18 ఏళ్ల నుంచి ఎస్సిఎస్సి ఎన్నో మంచి పనులు చేసిందని తెలిపారు. ట్రాఫిక్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వాలంటీర్లు పనిచేస్తున్నారని తెలిపారు.ఈ సమావవేశంలో దక్షిణ కొరియా దేశ ప్రతినిధులు, ఎస్సిఎస్సి ప్రతినిధుల కాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags :