కాంగ్రెస్ లోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎం.సంజయ్కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. 2018లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కుమార్ 2023 ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు. ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న ఆయన సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ గూటికి చేరారు.
Tags :