జునెటీన్త్ వేడుకల్లో కాల్పుల కలకలం
అమెరికాలోని టెక్సాస్ పార్క్లో నిర్వహించిన జునెటీన్త్ ( జాతీయ స్వాతంత్య్ర దినోత్సవం, ఫెడరల్ సెలవు) వేడుకల్లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. అందులో ఇద్దరు పిల్లలున్నారు. రౌండ్ రాక్లోని ఓల్డ్ సెటిలర్స్ పార్క్లో జునెటీన్త్ వేడుక సందర్భంగా శనివారం రాత్రి 11 గంటలకు ఈ కాల్పులు జరిగినట్లు అక్కడి పోలీస్ చీఫ్ అలెన్ బ్యాంక్స్ తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా కచేరీ విషయంలో రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం తలెత్తగా, గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడన్నారు. మరణించిన వారికి ఈ వాగ్వాదంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామన్నారు. కాల్పులు జరిపిన వారిలో ఎంత మంది పాల్గొన్నారనే దానిపై విచారణ జరుగుతుందని అలెన్ పేర్కొన్నారు.
Tags :