అమెరికాలో పేలిన తుపాకీ.. 29 మందికి
అమెరికాలో జరిగిన మూడు వేర్వేరు కాల్పుల ఘటనల్లో 29 మంది గాయపడ్డారు. అలబామాలోని మాంట్గోమెరీలో ఒక పార్టీలో జరిగిన కాల్పుల్లో 13 మంది గాయపడ్డారు. ఇందులో 9 మందికి తూటాలు తగిలాయి. అనంతరం జరిగిన గందరగోళంలో మరో నలుగురు గాయపడ్డారు. నార్త్ పాస్ ప్రాంతలో రద్దీగా ఉన్న పార్టీని లక్ష్యంగా చేసుకొని 600 రౌండ్లకుపైగా కాల్పులు జరిగినట్లు మేయర్ స్టీవెన్ ఎల్ రీడ్ తెలిపారు. ఒహాయో రాష్ట్రంలోని కొలంబస్లో జరిగిన ఒక ఘటనలో 10 మందికి తూటాలు తగిలాయి. వీరిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. న్యూయార్క్లోని రోచెస్టర్లో జరిగిన మరో కాల్పుల ఉదంతంలో ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానిక మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మెమోరియల్ పార్క్లో కొందరు గుమికూడారు. అక్కడ ఏదో అంశంపై వాగ్వాదం జరిగింది. ఇంతలో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు.
Tags :