Radha Spaces ASBL

తెలంగాణాలో రాష్ట్రపతి పాలన, షర్మిల సంచలన కామెంట్స్...!

తెలంగాణాలో రాష్ట్రపతి పాలన, షర్మిల సంచలన కామెంట్స్...!

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే కామెంట్స్ నేపధ్యంలో తెలంగాణా వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేసారు. తెలంగాణాలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందని, ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేసారు. రాజశేఖర్ రెడ్డి జల యజ్ఞం, ఫీజు రియంబర్స్ మెంట్ , ఆరోగ్య శ్రీ అన్ని పధకాలు తీసుకువచ్చారు.

ఈ పథకాలు రావడానికి వైఎస్ పాదయాత్ర కారణం అన్నారు. ఆయన పాదయాత్రను ఆదర్శంగా తీసుకోని నేను పాదయాత్ర చేశాను అన్నారు ఆమె. నేను నడిచే ప్రతి అడుగు లో ప్రజా సమస్యలు కనిపించాయని తెలిపారు ఆమె. అప్పులు లేని రైతులు ఉన్న తెలంగాణను అప్పుల మయం చేశారు అని మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి విత్తనాలు మీద సబ్సిడీ ఇచ్చారు అని గుర్తు చేసుకున్నారు. కెసిఆర్ ఇవ్వని తుంగలో తొక్కరు.... కెసిఆర్ అన్ని బంద్ పెట్టాడు అని మండిపడ్డారు. ఉచిత విద్య పై కెసిఆర్ మాట ఇచ్చి మోసం చేశారు అన్నారు ఆమె.

ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో విద్యార్థుల ను మోసం చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. కెసిఆర్ రాజశేఖర్ రెడ్డి తీసుకు వచ్చిన ఆరోగ్య శ్రీ తుట్లు పొడిచారు అని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి 46 లక్షలు మంది పేదలకు ఇండ్లు కట్టించారు అని వ్యాఖ్యానించారు. ఈ పాదయాత్ర లో మంగళవారం దీక్ష లు చేసి సమస్య లు దగ్గర ఉండి చూశాను అన్నారు. కెసిఆర్ అవినీతి ప్రశ్నించిన ఏకైక పార్టీ తమదే అన్నారు.

పాదయాత్ర  మధ్యలో ఢిల్లీ వెళ్లి ఢిల్లీ లో కెసిఆర్ అవినీతి పై గళం విప్పాను అని పాదయాత్ర కి ఎక్కడ అంతరాయము కలగలేదని పేర్కొన్నారు. కేవలం నా పాదయాత్ర ఆపడం కోసం కెసిఆర్ ఎదో ఒక రకంగా అడ్డుకోవడం జరుగుతుంది అని ఈ నెల. 28 నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నామని అన్నారు. నా పాదయాత్ర అపి కెసిఆర్ పెద్ద తప్పు చేశారు అని ఆరోపించారు. ఎక్కడ పాదయాత్ర ఆపారో అక్కడ నుంచి మళ్ళీ మొదలు పెడుతున్న అన్నారు ఆమె.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :